సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకపక్క రాజకీయాల్లో మరోపక్క సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. త్వరలో తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలలో కీలక పాత్ర పోషించి రాజకీయంగా ఎదగడానికి పావులు కదుపుతున్న రజినీకాంత్ మరోపక్క తన అభిమానులను ఏ మాత్రం నిరుత్సాహ పరచకుండా వరుస సినిమాలు చేస్తూ రెండు పడవలపై అద్భుతంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చివరి దశలో ఉంది. రజనీకాంత్ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలో విడుదల కానున్న క్రమంలో రజనీకాంత్ సినిమా విడుదల కాకముందే నెక్స్ట్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్.


విషయంలోకి వెళితే ఎలక్షన్స్ దగ్గరవుతున్న నేపథ్యంలో రజినీకాంత్ గురించి అనేక వార్తలు తమిళ మీడియా ప్రసారం చేస్తున్నాయి దీంతో రజనీకాంత్ అభిమానులు కలవరపడుతున్నారు. చాలావరకు దర్బార్ సినిమా రజినీకాంత్ చివర సినిమా అని ఇంకా రజినీకాంత్ సినిమాలకు దూరం అయిపోయినట్లే అని అనేక వార్తలు ఇటీవల తమిళ రాజకీయాల్లో మరియు మీడియా రంగంలో రావడంతో రజనీకాంత్ అభిమానులు కూడా రజనీ కాంత్ ఇంకా సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు...రాజకీయాల్లో అడుగు పెట్టేసాడు అని డిసైడ్ అయిపోయి సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ రకరకాల పోస్టులు పెట్టడంతో రజినీకాంత్ తన సినీ కెరీర్ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టే విధంగా దర్బార్ సినిమా విడుదల కాకముందే తన నెక్స్ట్ సినిమా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సినిమా ఒప్పుకోవడం జరిగింది అని సమాచారం.


త్వరలోనే రజినీకాంత్ ఈ వార్తని స్వయంగా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. గతంలోనే వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని అనేక వార్తలు వచ్చాయి..అయితే తాజాగా ఇటీవల వీరిద్దరు కలిసి ఒక పాయింట్ పై డిస్కషన్ చేసినట్లు దాన్ని స్టోరీగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు..రజినీ దర్బార్ సినిమా అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేస్తున్న దర్బార్ సినిమా రాబోయే సంక్రాంతికి విడుదల కానుంది. దర్బార్ సినిమాలో రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా నయనతార నటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: