టాలీవుడ్ లో ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డేకి పెద్దగా కలిసి రాలేదు. దాంతో తెలుగు లో కన్నా బాలీవుడ్ బెటర్ అనకున్న ఈ హాట్ బ్యూటీ హృతిక్ రోషన్ నటించిన ‘మోహాంజదారో’ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో లాభం లేదనుకొని తెలుగు లో మళ్లీ ప్రయత్నం మొదలు పెట్టింది. ఇదే సమయంలో హరీష్ శంకర్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో దువ్వాడ జగన్నాథం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఈ మూవీలో బికినీతో రెచ్చిపోయిన పూజా హెగ్డే స్కిన్ షోకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్నా..పూజా హెడ్గే జాతకం మార్చేసింది. తెలుగు లో వరుసగా టాప్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఎన్టీఆర్, మహేష్,వరుణ్ తేజ్ సరసన నటించిన పూజా హెగ్డే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ‘అలా వైకుంఠపురములో’ సినిమాలో నటిస్తుంది. తెలుగులో వరుస సినిమాలతో ఆకట్టుకున్న పూజా హెగ్డే రాజకుమారి మాల పాత్రలో కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతున్నారు.
బాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ హౌజ్ఫుల్. ఇప్పటికే ఈ సిరీస్లో విడుదలైన మూడు సినిమాలు ఘన విజయాలు సాధించగా తాజాగా మరో సీక్వెల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో సౌత్లో సూపర్ ఫాంలో ఉన్న పూజా హెగ్డే రాజకుమారి మాల, పూజ అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ 15 శతాబ్దపు రాజకుమారిగా రాయల్ లుక్తో పాటు 21వ శతాబ్దంలోని మోడ్రన్ అమ్మాయిగా స్టైలిష్ లుక్ తో కనిపించనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ మూవీకి మొదట సాజిద్ ఖాన్ను దర్శకుడిగా తీసుకున్నా మీటూ ఆరోపణలు రావటంతో ఆయన్ను తప్పించి ఫర్హాద్ను తీసుకున్నారు. ఈ మూవీలో మరో ముఖ్య పాత్రల్లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, బాబీ డియోల్, క్రితి సనన్, కృతి కర్బందా నటిస్తున్నారు. దీపావళి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ట్రైలర్ను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు.