సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. కాగా బాహుబలి వంటి ప్రపంచ రికార్డు సృష్టించిన సినిమా తరువాత ప్రభాస్ ఈ సినిమా చేయడంతో సాహో సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు మరియు ప్రభాస్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. అదే క్రమంలో బాహుబలి తర్వాత అదే స్థాయిలో హిట్ కొట్టాలని ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ ఎక్కువ కలిగిన సాహో స్టోరీని ఎంచుకుని బాహుబలి తర్వాత అదే స్థాయిలో అటు వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కనీసం ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలపాటు తీవ్రంగా కష్ట పడటం జరిగింది సమయాన్ని కేటాయించడం జరిగింది. తీరా సినిమా విడుదలయ్యాక దారుణమైన ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.


రిలీజ్ అయిన మొట్టమొదటి షో కే సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ రావడంతో ప్రభాస్ అభిమానులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉండగా నార్త్ లో కంటే సౌత్ లో కనీస ఆదరణ కూడా దక్కించుకోలేకపోయింది సాహో. తెలుగు తమిళం మలయాళం బాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టి కొద్దో గోప్పో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఉత్తరాదిలో రెండు రాష్ట్రాల్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలలో సాహో రికార్డు కలెక్షన్స్ సాధించిందని సమాచారం.


ఒరిస్సా రాష్ట్రంలో బాహుబలి 2 తరువాత అంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా సాహో నిలిచింది. కాగా బీహార్ లో కూడా సాహో చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. బీహార్ లో సాహో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుందట. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ సైతం వెనక్కి నెట్టి 6వ స్థానంలో గెలిచినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: