తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో బిగ్ బాస్ రియాల్టీ షో. సీజన్ 3 ప్రస్తుతం బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు అదిరిపోయే రేంజిలో ఎంటర్టైన్మెంట్ మరియు ఉత్కంఠభరితంగా చూస్తున్న ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఒకే లాగా వాతావరణం ఎప్పుడూ ఉండకుండా బిగ్ బాస్ ఆడిస్తున్న ఆటలు వారి మనసులో ఉన్న అసలు మనస్తత్వాన్ని బయట పెట్టేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఫెక్ ఎలిమినేషన్ తో ఇంటి నుండి రాహుల్ బయటకు వెళ్లి... తాజాగా ఇంటి లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత శివ జ్యోతిని అత్తగా పెడుతూ ముగ్గురు జంటలుగా ఇంటి సభ్యులను విడదీస్తూ..నౌకర్లు గా బాబా భాస్కర్ మరియు మహేష్ ని పెట్టి బిగ్ బాస్ ఇంటి సభ్యుల చేత ఆడించిన ఆట బుధవారం, గురువారం ఎపిసోడ్ లు అదరగొట్టింది.


అయితే ఆటలో భాగంగా ఇటుకలు పేర్చి ముగ్గురు జంటలు ఆడిన ఆట.. కొట్టుకునే అంత దాకా వెళ్లి పోయింది. ముఖ్యంగా హౌస్ లో ముందు నుండి ప్రాణ స్నేహితులు గా ఉన్నా వరుణ్ సందేశ్ మరియు రాహుల్ మధ్య జరిగిన ఆటలో కొట్టుకునే అంతదాకా వివాదం జరగటం ఎపిసోడ్ కె హైలెట్ గా నిలిచింది. దీంతో తొమ్మిది మంది హౌస్ లో ఉన్న క్రమంలో రొమాంటిక్ జంటగా ముందునుండి హౌస్ లో పేరు ఉన్న రాహుల్ మరియు పునర్నవి లు ఇప్పుడు అందరికీ టార్గెట్ అయినట్లు అయింది. ఈ టాస్క్ ముందు వరకు..వరుణ్ సందేశ్, రాహుల్, వితిక, పునర్నవి ఒక గ్యాంగ్ గా ముందు నుండి హౌస్ లో ఉంటం జరిగింది.


అయితే తాజాగా జరిగిన ఇటుకల ఆటలో మొత్తం ఈ నలుగురు ఒక జంట ఒక వైపు మరొక జంట మరో వైపు ఉండటంతో హౌస్ లోన్ ఇంటి సభ్యులు అంతా రాహుల్ మరియు పునర్నవి లను టార్గెట్ చేస్తూ వరుణ్ సందేశ్, వితిక కి సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇటువంటి క్రమంలో గురువారం జరిగిన ఎపిసోడ్లో చివరిలో అలీ రేజా ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు హౌస్ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. వైల్డ్ కార్డు రూపంలో అదిరిపోయే రీతిలో బిగ్ బాస్ హౌస్ లోకి అలీ రేజా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. దీంతో హౌస్లో ఎవరికి వారు వేసుకున్న స్ట్రాటజీ లు ఒక్కసారిగా తలకిందులు అయినట్లే అని చాలామంది అలీ రేజా ఎంట్రీ పై సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: