ఈ మద్య స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని పెట్టిన పెట్టుబడి బాగా రాబడితే..కొన్ని సినిమాలు మాత్రం దారుణంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకొని కోట్ల నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.  గతంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగ’ భారీ అంచనాల మద్య రిలీజ్ అయినా.. ఫ్లా టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఛతికిల పడింది.  దాంతో డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది..కాకపోతే ఈ వివాదాన్ని రజినీ స్వయంగా డీల్ చేసి క్లోజ్ చేశారు.

ఈ మద్య సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహెూ’ రూ.300 కోట్ల పెట్టుబడితె తెరకెక్కింది.  కానీ అందరి ఊహలు తలకిందులు చేస్తూ ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొన్ని చోట్ల ప్రభాస్ ఇమేజ్ తో డబ్బులు రిటన్ వచ్చినా...చాలా చోట్ల భారీ నష్టాలకు గురైంది.  తాజాగా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలబడబోతున్నాయి. కాకపోతే హీరోల మద్య స్నేహ సంబంధాల వల్ల రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ఒక్కోసారి సర్దుకుపోయే విషయంలో ఒకరికొకరు చెప్పకుంటూ ముందుకెళ్తుంటారు.

ఇప్పుడు కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కోసం.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలగు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్‌లో సినిమాలు పోటాపోటీగా రిలీజ్ చేసేస్తుంటారు. ఈ నేపథ్యంలో మహేశ్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ను జనవరి 11న, అల్లుఅర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో..’ 12న, రజనీ నటించిన ‘దర్బార్’ 10 న విడుదల చేయాలని అనుకున్నారు. 

ఈ మూడు మూవీలు టాప్ హీరోలు ఉండటంతో ఖచ్చితంగా కలెక్షన్లపై భారీ ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో.. రజినీపై ఉన్న అభిమానంతో మహేష్ బాబు మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ జనవరి 14న రిలీజ్ చేద్దామని దర్శకనిర్మాతలకు మహేశ్ సూచించారట. అంటే ఆ సూపర్ స్టార్ కోసం.. ఈ సూపర్‌ స్టార్ ఒక్క అడుగు వెనక్కి తగ్గి త్యాగం చేస్తున్నారన్న మాట. కాకపోతే ఈ మూవీ రిలీజ్ విషయం అఫిషియల్ గా రాలేదు..టాలీవుడ్ చర్చలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: