మన సౌత్ హీరోయిన్స్ అందరిది ఒకటే సైకాలజీ.. క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే హీరోయిన్స్ కి హీరోల మాదిగా లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండదు. బాగా తక్కువని తెలిసిందే. ముప్పై కి దగ్గర పడుతుంటే నెమ్మదిగా పక్కకు తోసేస్తారు. లేదా రెండు ఫ్లాపులు చాలు..హీరోయిన్ గా రిజెక్ట్ చేయడానికి. అయినా కానీ మన హీరోయిన్లకు ఎందుకో పక్కా ప్లాన్, ముందు జాగ్రత్త ఉండదు. టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్, కోలీవుడ్ కు వెళ్లాలనుకుంటారు. సరిగ్గా అక్కడే జరగకూడని నష్టం జరిగిపోతోంది. అక్కడ సక్సస్ అవ్వక, ఇక్కడ ఉన్న క్రేజ్ పోగొట్టుకొని రెండు చోట్లా జీరో అవుతారు. ఇప్పుడు రష్మిక కూడా అదే చేయబోతోంది.

ప్రస్తుతం తెలుగులో రష్మిక స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. కాల్షీట్ ఇస్తానంటే చాలు బేరాలు ఆడకుండా కళ్లకద్దుకొని తీసుకునే హీరోలు, నిర్మాతలు ఉన్నారు. కానీ రష్మిక మాత్రం కోలీవుడ్ వైపు ఆశగా చూస్తోంది. కుదిరితే విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల సరసన నటించాలని ప్లాన్ వేసుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో కార్తి సరసన నటిస్తోంది రష్మిక. రష్మిక కి తమిళంలో ఇదే మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత ఎలాగైనా విజయ్ సరసన నటించాలని తెగ ఆరాట పడుతోంది. అందుకే విజయ్ తో సినిమా చేస్తున్న దర్శక, నిర్మాతలకి సంకేతాలు పంపుతోందట. దాంతో దర్శక, నిర్మాతలు విజయ్ సినిమాలో ఛాన్స్ ఇవ్వచ్చనే ఆశతో తెలుగులో ఎవ్వరికీ కాల్షీట్లు ఇవ్వడం లేదట. 

రీసెంట్ గా రామ్ సినిమా కోసం రష్మిక ను సంప్రదిస్తే, డేట్స్ లేవని చెప్పి వెనక్కి పంపించేసిందని తాజా సమాచారం. ఇక ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ మహేష్ సరసన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది. అటు నితిన్ తో 'భీష్మ' సినిమాలోను చేస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బన్నీ-సుకుమార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతోంది. ఇలా చేతినిండా సినిమాలున్నప్పటికీ, టాలీవుడ్ లోనే కొనసాగాలని అనుకోకపవడం ఆశచర్యకరం. ఇప్పటికే పూజా ఒకసారి బాలీవుడ్ కి వెళ్ళి బోల్తా పడి వచ్చింది. ఇప్పుడిదే పొరపాటు రష్మిక చేయబోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: