గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ యాక్షన్ ప్రధాన చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'సీటీ మార్' అనే మాస్ టైటిల్ని పరిశీలిస్తున్నారు.


'యూ టర్న్‌' చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభి స్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. గోపీచంద్‌ హీరోగా నటించే ఈ భారీ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తారు. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్‌లో 'గౌతమ్‌ నందా' చిత్రం వచ్చింది. అలాగే శ్రీనివాస చిట్టూరి గతంలో రవితేజతో ఓ చిత్రాన్ని నిర్మించారు. గోపీచంద్‌ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నట్లు నిర్మాత అన్నారు. ఈ ప్రెస్టీజియస్‌ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ : పవన్‌ కుమార్‌, కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంపత్‌ నంది.


ఇదిలా ఉంటే గోపీచంద్ కధానాయకుడుగా నటిస్తున్నా చిత్రం 'చాణిక్య' మేహరీన్ , జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తిరు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ రోజు సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసారు. ఇందులో గోపీచంద్ ఓ సిక్రెట్ ఎంజేంట్ గా కనిపించనున్నారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాని అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
‘‘స్పై బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన  ‘చాణక్య’ మా బేనర్‌కు ఒక మెమొరబుల్‌ మూవీ అవుతుంది. తిరు చాలా టాలెంటెడ్‌. ఈ సినిమాకి మేం ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్‌ మీద రెండింతలు కనపడేలా చేశారు. ఈ స్పై థ్రిల్లర్‌లో మంచి వినోదం కూడా ఉంది. గోపీచంద్‌ కెరీర్‌లో ఇది ఒక గేమ్‌ చేంజర్‌ మూవీ అవుతుంది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్‌ రాశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: