మొన్నటి వరకు నీరసంగా చప్పగా సాగిన బిగ్ బాస్ గేమ్ షో రాహుల్, వరుణ్ ల మధ్య జరిగిన గొడవ ద్వారా ఊపందుకుంది. అదీ గాక స్ట్రాంగ్ కంటెండర్ అయిన ఆలీ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల మరింత మజా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆలీ మీద బయట ప్రభావం చాలా పడిందని తెలుస్తుంది. బిగ్ బాస్ లో మొట్ట మొదటిసారిగా డబల్ స్టాండర్డ్స్ అనే మాట తీసుకు వచ్చింది ఆలీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఒకానొక విషయంలో డబల్ స్టాండర్డ్స్ తో గేమ్ ఆడిందని ఆలీ ఆరోపించాడు.


అయితే అదే తప్పుని రీ ఎంట్రీ ఇచ్చాక ఆలీ కూడా చేయడం వింతగా అనిపించింది. రీ ఎంట్రీ ఇచ్చాక ఇంతకు ముందు ఇంటి సభ్యులతో ఎంత స్నేహంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టు కనిపిస్తున్నాడు. శివజ్యోతి పట్ల కానీ, శ్రీముఖి పట్ల గానీ ఇంతకు ముందులానే ఉన్నట్టు కనిపించాడు. శ్రీముఖి, ఆలీ ఎంత స్నేహంగా ఉండేవారో అందరికీ తెలుసు. ఆలీ రీ ఎంట్రీ ఇచ్చినపుడు శ్రీముఖి ఆనందపడటం, దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోవడం, ఆలీ కూడా ఆమెతో కలివిడిగా ఉండటం బాగానే ఉంది.


ఎలిమినేట్ అయ్యి రీ ఎంట్రీ ఇచ్చాక అతనిలో మార్పు స్పష్టంగా కనిపించింది. శుక్రవారం ఎపిసోడ్ లొ మహేష్, బాబా భాస్కర్, శివజ్యోతి, ఆలీ నలుగురు కలిసి డిస్కస్ చేస్తుండగా, మహేష్ శ్రీముఖి గురించి నెగెటివ్ గా మాట్లాడతాడు. పక్కనే ఉన్న ఆలీ దానికి వంత పాడతాడు. శ్రీముఖి ఇంతకు ముందు స్నేహంగా ఉన్నవాడు బయటకు వెళ్ళి రాగానే మారిపోవడం విషయం కాకపోయినా, మారినట్టు కనిపించకపోవడమే పెద్ద విశేషం.


శ్రీముఖి అంటే ఇష్టం లేనపుడు ఆమెతో కూడా లానే ప్రవర్తించాలి. కానీ ఆమెతో స్నేహంగా ఉండి, పక్కకి వచ్చి ఆమె గురించి నెగెటివ్ గా మాట్లాడటం తప్పు. ఇన్ని రోజులు ఆలీ ఒక్కడే డబల్ గేమ్ ఆడట్లేదని భావించారు. కానీ రీ ఎంట్రీ తో అతను కూడా డబల్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఏదయినా మొహం మీదే చెప్తాననే ఆలీ కూడా డబల్ గేమ్ ఆడటం బాలేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: