స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాకు సంబందించిన మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో మొదటి సాంగ్ సామజవరగమన రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. నీ కాళ్లను పట్టుకు వదలన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు అంటూ లిరిక్స్ తో వచ్చాయి.


సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన అల వైకుంఠపురములో మొదటి సాంగ్ రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టుగానే ఈ సాంగ్ అదిరిపోయింది. ప్రోమోతోనే సాంగ్ పై అంచనాలు పెరుగగా ఆ అంచనాలను అందుకుంటూ ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. సిద్ శ్రీరాం పాడిన ఈ సాంగ్ తో మరోసారి తన మెలోడీ ప్రతిభ చాటుకున్నాడు తమన్.


మాములుగా తన సినిమాల్లో పాటల విషయంలో చాలా కేర్ తీసుకునే అల్లు అర్జున్ ఈ సినిమాలో కూడా తమన్ తో మంచి ఆల్బం రాబట్టినట్టు ఉన్నాడు. తమన్ మ్యూజిక్ కు శాస్త్రి గారి సాహిత్యం మరింత క్రేజ్ తెచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్లు అందుకున్న బన్ని, త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది.


2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అల్లు అర్జున్ కి కచ్చితంగా హిట్ ఇచ్చేలా ఉంది. మధ్యతరగతి కుర్రాడి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా నటిస్తున్నారు. హరిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. చూస్తుంటే బన్ని ఈసారై పక్కా హిట్టు కొట్టేలా ఉన్నాడనిపిస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: