పాత తరం సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్లుగా చలామణి అయిన సావిత్రి,జమున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు..హీరోయిన్లు అంటే సావిత్రి,జమున అనేవారు.  వీళ్ల కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.  అయితే సావిత్రి, జమున కాంబినేషన్ ఎన్నో సినిమాలు వచ్చాయి..అప్పట్లో వీరిద్దరు అక్కచెల్లెళ్లు అనేవారు.  రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరు అక్కాచెల్లెళ్లు లా ఉండేవారని అంటారు.  సావిత్రి చివరి రోజుల్లో జమున ఎంతో సహాయం చేసిందని అంటారు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినియర్ నటి జమున ఎన్నో సంచలన విషయాలు తెలిపారు.


అప్పట్లో దర్శక నిర్మాతలు .. నటీనటులందరూ ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఒకరంటే ఒకరికి గౌరవ మర్యాదలు ఉండేవి. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనల వంటివి జరగకపోలేదు. సావిత్రి అంటే దర్శక, నిర్మాతలు ఎంతో గౌరవించేవారు..ఆమె కాల్షీట్ల కోసం పడిగాపులు కాసేవారని అన్నారు.  తెలుగు లోనే కాదు తమిళంలో కూడా ఆమెకు ఎంతో డిమాండ్ ఉండేది.  ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లు నటించిన ‘మిస్సమ్మ’ సినిమాలో తనకు చాన్సు చాలా విచిత్రంగా వచ్చిందని అన్నారు.  మొదట ఈ మూవీలో సావిత్రి, భానుమతి అనుకున్నారు.   అంతే కాదు వారితో వారం పదిరోజులు షూటింగ్ కూడా జరిగిందట.


ఓ రోజు  శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని భానుమతి గారు షూటింగుకి ఆలస్యంగా వచ్చారు. భానుమతిగారు ముందుగానే చెప్పినా, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణిగారికి కోపం వచ్చింది. దాంతో ఆయన 'ఇట్లా అయితే ఎట్లా .. నువ్వు వద్దులే పో' అన్నారు. 'నువ్వూ వద్దులే పో' అంటూ మేకప్ తీసేసి ఆమె వెళ్లిపోయారు. దాంతో ఆమే కాస్త మనసు నొచ్చుకున్నట్లు వెళ్లిపోయింది.  దాంతో ఆమె స్థానంలో సావిత్రిని తీసుకొని ఆమె చెల్లెలు పాత్రలో నన్ను తీసుకున్నారు. ఇలా సూపర్ హిట్ మూవీ మిస్సమ్మ మూవీలో తనకు ఆ పాత్ర చాలా విచిత్రంగా వచ్చిందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: