యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలుగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఘోర పరాజయాన్ని అందుకోవడంతో, బాలకృష్ణ కొంచెం ఢీలా పడ్డట్లు సమాచారం., వాటి అనంతరం ప్రస్తుతం కేస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాతగా ఒక సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నట్లు బాలకృష్ణ అధికారిక ప్రకటన చేసి ఉన్నారు. గతంలో బాలయ్య బోయపాటిల కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో తయారవుతోందని, తప్పకుండా వారిద్దరికీ ఇది హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందని సమాచారం అందుతోంది. ఇకపోతే దాని తర్వాత అతి త్వరలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమాలో నటించనున్నారు. దానిపై కూడా మరికొద్దిరోజుల్లో ప్రకటన రాబోతోందట. 

ఇక వాటితో పాటు ఇంకో సినిమాను కూడా బాలకృష్ణ లైన్లో పెట్టినట్టు సమాచారం, గతంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన క్రిష్, ఆ తరువాత కథానాయకుడు, మహానాయకుడు సినిమాల రూపంలో ఫ్లాప్స్ ఇచ్చినప్పటికీ, అతనితోనే మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారట బాలయ్య. అయితే దీనిపై మాత్రం అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విధంగా నందమూరి బాలకృష్ణ ఒకేసారి ఏకంగా మూడు సినిమాలు లైన్లో పెట్టడం, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలో తెరకెక్కబోయే ఈ మూడు సినిమాలు బాలకృష్ణకు ఎంతమేర విజయాన్ని అందిస్తాయో వేచి చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: