2013లో ఆఫ్బీట్ క్రియేటివ్ మూవీగా రూపొంది,కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాయల్ రీల్ అవార్డుతో పాటు,ఏడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు పురస్కారాలు అందుకున్న చిత్రం‘డ్రీమ్’దీనికి దర్శకుడు భవానీ శంకర్,ఈయన దర్శకత్వంలో కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై పి.రాజేశ్వర్రెడ్డి,కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం క్లైమాక్స్.. రాజేంద్రప్రసాద్,శివశంకర్ మాస్టర్,సాషా సింగ్,రమేశ్,చందు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం,చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
పొలిటికల్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీగా రాబోతున్న ఈ సినిమాలో తక్కువ పాత్రలే ఉన్నప్పటికీ,ప్రతిపాత్రా హీరో లా ఉంటుందని,చిత్ర దర్శకుడు తెలియజేసారు..ఇక త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసే భారీ సెట్లో ఒక పాట తీయ బోతున్నా రట.ఇప్పటికే ఏడు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు పురస్కారాలు అందుకున్న భవానీశంకర్,ఈ చిత్రాన్ని అద్భుతం గా తెరకెక్కిస్తున్నారని,నిర్మాతల్లో ఒకరైన పి.రాజేశ్వర్రెడ్డి అన్నారు.మా చిత్రంలో రాజేంద్రప్రసాద్గారి పేరు మోడీ.ఈయనకు ఆపేరు ఎందుకు పెట్టామనేది సినిమాచూస్తే తెలుస్తుందని,మోడీ పాత్రకోసం ఆయన స్పెషల్గా మేకోవర్ అయ్యారనీ రాజేశ్వర్రెడ్డి తెలిపారు.
ఇక మరో కీలకమైన పాత్రను స్పెషల్ పర్సన్ చేస్తుండగా,రాజేశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రేమ్రక్షిత్ మూడు పాటల కు కొరియోగ్రఫీ అందిస్తున్నారని దర్శకుడు భవానీ శంకర్ అన్నారు.ఇక డా.రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సాషా సింగ్, రమేష్,చందు కీలక పాత్రలు పోషిస్తున్నారు..ఇప్పటికే నటుడు రాజేంద్రప్రసాద్ పలు కీలమైన పాత్రల్లో నటించి,నటుడిగా ఖండాలు,దేశాలు దాటి ప్రశంసలు అందుకున్నాడు.అంతే కాకుండా, అమెరికా ప్రభుత్వ నుంచి లైఫ్ టైం ఎచీవ్ మెట్ అవార్డ్,ఆస్ట్రేలియా పార్లమెంట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం కూడా దక్కించుకున్నారు.ఇక మరోసారి విభిన్నమైన పాత్రతో 'క్లైమాక్స్' మూవీతో మనముందుకు రాబోతున్నాడు..