నందమూరి బాలక్రిష్ణ ప్రస్తుతం 105 సినిమాతో బిజీగా ఉన్నాడు. జై సింహా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్లో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే డిసెంబర్, లేకపోతే ఫిబ్రవరి ఈ మూవీ రిలీజ్ అంటున్నారు. ఈ మూవీ చేస్తూనే బాలయ్య వరసగా తన కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నాడు. అందులో అనూహ్యమైన కాంబోలు కూడా ఉన్నాయి.


ఇక బాలయ్య 106 మూవీని ఈ ఏడాది ప్రారభించడానికి రెడీ అవుతున్నారు. దాన్ని బాలయ్యతో వరసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీగా డైరెక్ట్ చేయనున్నాడు. ఈ మేరకు కధ చెప్పడం బాలయ్య నచ్చుకోవడం కూడా జరిగిపోయింది. ఈ మూవీని కూడా వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కి కానీ దసరాకు కానీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


ఇక బాలయ్య 107వ చిత్రం కూడా బుక్ అయినట్లే. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చిన పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో బాలయ్య కొత్త మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పోలీస్ ఆఫీసర్ కధతో ఉంటుంది. అటు బాలయ్యకు, ఇటు పూరీఎకి ఇద్దరికీ అచ్చి వచ్చిన పోలీస్ సెంటిమెంట్ తో ఈ మూవీ తీస్తున్నారని అంటున్నారు.


దీని తరువాత మూవీ అంటే 108వ చిత్రంగా బాలయ్య, క్రిష్ కాంబోలో మరో మూవీ ఉంటుందని అంటున్నారు. ఈ ఇద్దరు ఫస్ట్ టైం కలసి చేసినది గౌతమి పుత్ర శాతకర్ణి మంచి విజయం సాధించింది. ఆ తరువాత చేసిన కధానాయ‌కుడు, మహానాయకుడు రెండూ కూడా భారీ డిజాస్టర్లు అయ్యాయి. దాంతో క్రిష్ కి బాలయ్య ఇక దూరంగా ఉంటారని అంతా అనుకుంటున్న వేళ మళ్ళీ ఈ కాంబో జనం ముందుకు వస్తుందన్న టాక్ ఇపుడు వినిపిస్తోంది.


బాలయ్యకు మంచి స్టోరీ లైన్ క్రిష్ వినిపించాడని, దానికి బాలయ్య ఎస్ అనేశాడని అంటున్నారు. మరి ఆ మూవీ చారిత్రాత్మకమా. లేక సాంఘికమా  అన్నది చూడాలి. ఏది ఏమైనా క్రిష్, బాలయ్య మూవీ అంటే మళ్ళీ ఇంటెరెస్ట్  కలుగుతోంది. చూడాలి పూర్తి వివరాలు ఏం చెబుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: