తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 పదకొండో వారానికి చేరింది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య చిన్న చిన్న తగాదాలు తప్ప ఇతర భాషల్లో వస్తున్నట్టు పెద్దగా కాంట్రవర్సీలు ఏమీ లేవు. వాస్తవానికి బిగ్ బాస్ 1, 2 సీజన్లో ఇంటి సభ్యుల మద్య దారుణమైన పోటీ,కాంట్రవర్సీలు నెలకొన్నాయి. ఈసారి బిగ్ బాస్ లో మాత్రం ఇంటి సభ్యుల మద్య స్నేహపూర్వక సంబంధాలు..అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు మాత్రమే నడుస్తున్నాయి. బిగ్ బాస్ 3 పూర్తి కావడానికి మరి ఐదు వారాలు మాత్రమే ఉంది.
మొన్న శనివారం నాగార్జున వచ్చినపుడు అందరూ ఫినాలేకి రెడీ కావాలని..ఇక నుంచి గేమ్, టాస్క్ లు సీరియస్ గా ఆడాలని..ఎవరూ కామెడీ చేయొద్దని పేరు పేరునా వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఇంటి సభ్యుల మద్య చిన్న చిన్న తగాదాలు..పోటీ తత్వం పెరిగిపోతుంది. నిన్న బిగ్ బాస్ ఇచ్చిన 'కుళాయి కొట్లాట' గేమ్లో పునర్నవి సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్లో గ్లాస్ కంటెయినర్లో నీళ్లు నింపి స్మైలీ బాల్ను పైకి వచ్చేలా చేయాలి. అయితే నామినేట్ అయిన సభ్యులను బిగ్ బాస్ ఈ
గేమ్ కి అనర్హులుగా ప్రకటించారు.
ఈ
గేమ్ లో శివజ్యోతికి
అలీ రెజా హెల్ప్ చేశారని ఇంటి సభ్యులు ఆరోపించడంతో..బిగ్ బాస్ కూడా వారిని ఈ
గేమ్ నుంచి పక్కకు పంపించడం జరిగింది. ఈ లెవల్లో విజయం సాధించిన వితిక నేరుగా ఫైనల్కు అర్హత సాధించటంతో శ్రీముఖి,
అలీ రెజా, శివజ్యోతి, బాబా భాస్కర్లు రెండవ లెవల్ ఆడబోతున్నారు. ఈ టాస్క్లో వారి శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఫ్రేములలో నిలబడగా వారి తలపై ఒక చెక్కను పెడతారు.
అలీ రెజా మాత్రం ఒక్కసారే తన బ్యాలెన్స్ కోల్పోయినట్లు కనిపిస్తుంది. మరీ ఈ టాస్క్ లో ఎవరు విన్ అవుతారో ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.