విలక్షణ కథాచిత్రాల కథానాయకుడు ధనుష్ నటించిన కోలీవుడ్ లేటెస్ట్ సినిమా అసురన్. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ జాతీయ అవార్డు కాంబో మూవీపై రిలీజ్ ముందే అంచనాలేర్పడ్డాయి. ట్రైలర్ కూడా డిఫరెంట్ యాక్షన్ తో ఆకట్టుకోవడంతో అభిమానుల్లో ఇప్పటినుంచే ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ శుక్రవారం అసురన్ విడుదలైంది. అందరు అనుకున్నట్టుగానే కోలీవుడ్ లో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇదో వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రం అని ప్రేక్షకులు చెబుతున్నారు. 'వెక్కై' అనే ఓ ఫేమస్ నవల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇటీవల ప్రయోగాలతో ముందుకెళుతున్న ధనుష్ ఈ సినిమాలో అసురుడు అనిపించే శివస్వామి పాత్రలో నటించాడు. ముఖ్యంగా గెటప్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 

ఈ సినిమాకి మొదటి షో నుంచే ట్రెమండస్ రెస్పాన్స్ మొదలైనట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ ఖచ్చితంగా వస్తుందని.. ధనుష్ నటన అద్భుతం అని ప్రశంసిస్తున్నారు. ధనుష్ నటనకు జాతీయ అవార్డు దక్కకపోతే  అవార్డుకే అర్థం వుండదని.. ఖచ్చితంగా అవార్డుని సొంతం చేసుకునే సినిమా ఇదని ట్విట్టర్ వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. సైరా వంటి బిగ్గెస్ట్ మూవీ తరువాత రిలీజైన సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే భారీ తారాగణంతో తెరకెక్కిన సైరా కంటే అసురన్ బాగా ఆకట్టుకుంటుందని కోలీవుడ్ మీడియా సమాచారం. ఇక మలయాళ నటి మంజు వారియర్ కథానాయికగా తమిళ తెరకు పరిచయమైంది.

ఇక అసురన్ ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే రథన్ బీజీఎమ్స్ అధ్భుతమని సంగీతం పరంగానూ సినిమా అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో ధనుష్ తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రల్లోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దీంతో అసురన్ తో ధనుష్ కు నేషనల్ అవార్డ్ గ్యారంటీ అన్న టాక్ బాగానే స్ప్రెడ్ అవుతోంది. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు ఖాయమన్నారు. కానీ రాలేదు. మరి ధనుష్  కి అయినా వస్తుందా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: