తెలుగు లో బిగ్ బాస్ 3 సీజన్ మొదలై ఇప్పటి కి పది వారాలు పూర్తి చేసుకుంది. మరికొన్ని రోజులు మాత్రమే బిగ్ బాస్ ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యులు కూల్ గా ఆడుతున్నా ఇప్పుడు మాత్రం జట్లుగా ఏర్పట్లు తెలుస్తుంది.  దీనికి కారణం మొన్నటి బిగ్ బాస్ ఫినాలే మెడల్ విషయంలో జరిగిన సంఘటన ప్రస్పుటంగా కనిపిస్తుంది.  బాబా భాస్కర్, వితిక ఫైనల్ లో ఉండగా.. శివజ్యోతి, మహేష్,శ్రీముఖిలు బాబా భాస్కర్ ని సపోర్ట్ చేయగా, రాహుల్, పునర్నవి,అలి రెజా,వరుణ్ సందేశ్ వీరంతా వితిక కు సపోర్ట్ చేశారు. 


అయితే  వీరంతా తర్వాత జట్టుగా మాట్లాడుకోవడం బిగ్ బాస్ లో చూశాం.  అంటే కావాలని ఈ గ్రూప్ బాబా భాస్కర్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఈ విషయం శ్రీముఖి, మహేష్, శివజ్యోతి కలిసి మాట్లాడుకోవడం నిన్నటి ఎపిసోడ్ లో కనిపించింది. ఇక ఇంట్లో తనను టార్గెట్ చేసినందుకు బాబా భాస్కర్ ఆ గ్రూప్ కి కాస్త దూరంగా వెళ్లడం గమనించిన అలీ రెజా..ఎందుకు గురువు గారు పక్కకు పక్కకు తప్పుకుంటారు అన్నాడు. 


దానికి గతంలో రాహూల్, వరుణ్ ల మద్య గొడవ వస్తే ఇలాగే ఉన్నారు..నాకు కాస్త బాధగా ఉంది..నేను ఏం తప్పు చేశాను..అనేది గుర్తు చేసుకుంటున్నా అంటూ వారితో అయిష్టాంగానే మాట్లాడాడు బాబా భాస్కర్.  ఏది ఏమైనా ఫైనల్ కి వస్తున్నా కొద్ది ఇంటి సభ్యుల ప్రవర్తనలో పూర్తి మార్పు కనిపిస్తుంది. మరి రాను రాను ఎలాంటి టాస్క్ లు ఉంటాయో..ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: