సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళుతోంది హీరోయిన్ నయనతార. ఎంత ఏజ్ వచ్చినా కానీ అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి నయనతారకి. ఎంత మంది హీరోయిన్లు పోటీకి వచ్చిన నయనతార కి డిమాండ్ తగ్గటం లేదు. ప్రస్తుతం దర్బార్ అనే సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న నయనతార మహేష్ బాబు తో ఒక ఫోటో షూట్ లో పాల్గొనడం ఇప్పుడు తమిళ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మామూలుగా అయితే నయనతార ఎటువంటి ఫోటో షూట్ లకు మరియు అదే విధంగా తాను నటించిన సినిమా ఫంక్షన్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. అటువంటిది మహేష్ తో నయనతార ఫోటోషూట్ లో పాల్గొనడంతో ఈ ఫోటోలు చూసిన చాలామంది సౌత్ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు షాక్ తిన్నారు.


నయనతార తాను పెట్టుకున్న రూల్స్ ని బ్రేక్ చేసిందా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. వోగ్ ఇండియా కవర్ పేజీ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నయన్ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సౌత్ సూపర్ స్టార్స్ అయిన మహేష్, దుల్కర్ సల్మాన్ ఫోటోలు కలిగి ఉన్న మ్యాగజైన్ కవర్ పేజిపై మహేష్ తో పాటు నయనతార కూడా ఉండటం తో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


చిరంజీవితో ఇటీవల 'సైరా' అనే సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించడం జరిగింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం జరిగింది. అయినా గాని పెద్దగా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో నయనతార పాల్గొనలేదు. సినిమా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ అయినా ఎక్కడ కూడా నయనతార కనిపించలేదు. అటువంటిది ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజి లో ఒక ఫోటో షూట్ మహేష్ తో నయనతార చేసినట్లు వార్త బయటకు రావడంతో..ఈ వార్త ఇప్పుడే పెద్ద హాట్ టాపిక్ గా సౌత్ ఇండస్ట్రీ లోమారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: