ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు.  ముఖ్యంగా సెలబ్రెటీకుల సంబంధిన విషయాలు  క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  ఇక స్టార్ హీరోల సినిమా విషయాల్లో ఈ ఉత్సాహం సోషల్ మీడియాలో మరీ ఎక్కువగా ఉంటుంది.  లేనిది ఉన్నట్లు ఉన్నట్లు లేనట్లు చూపించడం కామన్ అయ్యింది.  ఇక స్టార్ హీరోల సినిమాల మూవీ రిలీజ్ అయిన తర్వాత తెల్లవారి నుంచి ఆ మూవీ బ్లాక్ బస్టర్, మాస్ హిట్..సూపర్ హిట్ అంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.   

దాంతో ఈ మూవీ టాక్ ఇలా వచ్చింది..మరి రిజల్ట్ ఇంత బీభత్సంగా ఇస్తున్నారేంటీ..అంటూ నెటిజన్లు తెగ కన్ఫ్యూజన్ చేస్తుంటారు.  దాంతో ఫ్యాన్స్ మద్య కూడా అభిప్రాయ భేదాలు రావడం..మా హీరో సూపర్ అంటే మా హీరో సూపర్ గొడవలు పెట్టుకున్న రోజులుకూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద హీరోల సినిమాల మధ్య కలెక్షన్ల యుద్దం ఎప్పటి నుంచో నడుస్తున్నదే అయినా అది ఈమధ్య మరీ ఎక్కువైంది. సోషల్ మీడియా వినియోగం ఎక్కువవడంతో ఫ్యాన్స్ ఈ వసూళ్ల అంశాన్ని నెట్టింట్లో పెట్టి బాహాబాహీకి దిగుతున్నారు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునే టాక్ ఏంటో వినిపిస్తుంది..కానీ ఆ టాక్ తో సంబంధం లేకుండా  నిర్మాతలు సైతం ఫస్ట్ డే రికార్ఫ్, సెకండ్ డే రికార్డ్స్ అంటూ ఎప్పటికప్పుడు పోస్టర్లు వదులుతూ అభిమానుల్ని కన్ఫ్యూజ్ లొ పడేస్తుంది. 

అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రామ్ చరణ్ తన సినిమాల విషయంలో ఇకపై ఇలా వసూళ్లను పోస్టర్లలో ఉంచవద్దని తన నిర్మాతలను రిక్వెస్ట్ చేయడమే కాక తాను నిర్మించే సినిమాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటానని ప్రకటించారు.  గతంలో రాంచరణ్ ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డారని అంటున్నారు.  తన తండ్రి చిరుతో నిర్మించిన ‘సైరా’ విషయంలో అమలు చేస్తున్నారు. చిత్రం మొదటి రోజు రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టినా, తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్నా వాటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: