ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెర పై ప్రసారం అవుతున్న షోల్లో మంచి క్రేజ్ మరియు రేటింగ్స్ తో దూసుకుపోతున్న షో బిగ్ బాస్ సీజన్ 3. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ షోకు సంబంధించి ఇప్పటికే జరిగిన రెండు సీజన్స్ మంచి సక్సెస్ అవ్వగా, ప్రస్తుతం సాగుతున్న సీజన్ 3 మరింత రసవత్తరంగా ముందుకు సాగుతోంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా, రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించి షోని మంచి క్రేజ్ తో ముందుకు తీసుకెళ్లగా, ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ మూడవ సీజన్ ని తనదైన ఆకట్టుకునే హోస్టింగ్ టాలెంట్ తో ఆడియన్స్ ని  అలరించేలా మరింత రసవత్తరంగా  ముందుకు నడిపిస్తున్నారు నాగ్. 

ఇకపోతే నేటి షో మరింత ఆసక్తికరంగా సాగేందుకు బిగ్ బాస్ టీమ్ వారు ఒక భారీ ఊహించని సడన్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినట్లు పలు టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అయితే ఆసర్ప్రైజ్ ని బిగ్ బాస్ టీమ్ ఎంతో గోప్యంగా ఉంచాలని భావించినప్పటికీ కూడా కుదరలేదట. నేడు కొందరు దానిని బయటకు లీక్ చేయడం జరిగింది. అదేమిటంటే, ఇటీవల తన 151వ సినిమా సైరా నరసింహారెడ్డితో మంచి విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నేటి బిగ్ బాస్ షోలో తళుక్కున మెరవనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షోలో మెగాస్టార్ గత వారమే పార్టిసిపేట్ చేయవలసిందని, 

అయితే సైరా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడం వలన కుదరలేదని, అందుకే నేటి షో షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నట్లు విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇక కింగ్ నాగార్జున కూడా ఈ షోకి చిరుని ప్రత్యేకంగా ఆహ్వానించడంతో వారి కోరికను కాదనలేక చిరు స్పెషల్ అపియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. చిరంజీవి ఒక 15 నిమిషాల పాటు నేటి షోలో సందడి చేయనున్నారని అంటున్నారు. అయితే దీని పై ఇప్పటికేవరకు బిగ్ బాస్ టీమ్ నుండి కానీ, స్టార్ మా యాజమాన్యం వారి నుండి గాని ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే ఒకవేళ ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, బిగ్ బాస్ షోలో హౌస్ మేట్స్ కి ఇది మంచి పండుగ వార్త అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: