టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పిల్ల నువ్వు లేని జీవితం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తొలి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక దాని తరువాత ఆయన నటించిన రేయ్ సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది, ఆ వెంటనే ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో నటించగా, అది మంచి విజయం అందుకుని కెరీర్ పరంగా తేజ్ కు మంచి గుర్తింపుని ఇచ్చింది. దాని అనంతరం యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సుప్రీం సినిమా సూపర్ హిట్ సాధించి, 

సాయి కెరీర్ కు ఎంతో హెల్ప్ చేసింది. కాకపోతే అక్కడినుండి ఆయనకు వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఒక్కొక్కటిగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లిన తేజ్ కు వరుసగా ఆరు ఫ్లాపులు ఆయన కెరీర్ కి కొంత దెబ్బేసాయి. అయితే అనంతరం కొంత గ్యాప్ తీసుకుని కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తేజ్ నటించిన చిత్రలహరి మంచి విజయాన్ని అందుకుని, ఆయన కెరీర్ కి బ్రేక్ ని ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం యువ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమాలో నటిస్తున్న సాయి తేజ్, అతి త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటించనున్నారు. 

నూతన యువ దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. కాగా ఈ సినిమా టైటిల్ ని నేడు ప్రకటించిన సినిమా యూనిట్, అతి త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ మరియు ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని అంటోంది. నేటి యూత్ ని ఆకట్టుకునే ఒక మంచి పాయింట్ తో ఎంటెర్టైన్మెంట్ అంశాల కలగలుపుగా తెరకెక్కబోయే ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి రాబోయే సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: