టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనుంది చిత్ర బృందం. లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి ఈ సినిమా ద్వారా చాలా ఏళ్ళ తరువాత తెలుగు సినిమా రంగానికి నటిగా ఎంట్రీ ఇస్తున్నారు. 

మంచి ఎంటర్టైన్మెంట్ తో అన్ని కమర్షియల్ హంగులను కలగలిపి తెరక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమాకు పోటీగా స్టైలిష్ స్టార్ అల్లు హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా కూడా ప్రస్తుతం వేగంగానే షూటింగ్ ని జరుపుకుంటోంది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీగా దీనిని నిర్మిస్తున్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, నేటి సాయంత్రం గం.5.04ని. లకు సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

అయితే వారికి షాక్ ఇస్తూ అల వైకుంఠపురములో టీమ్ నేటి ఉదయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అదేమిటంటే, నేటి సాయంత్రం గం.4.05ని.లకు తమ సినిమా నుండి తాజా పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు వారు షాకింగ్ గా ప్రకటించడం జరిగింది. దీనిని బట్టి చూస్తే సరిగ్గా సరిలేరు నీకెవ్వరు టీమ్ కంటే ఖచ్చితంగా ఒక గంట ముందే తమ సినిమా తాజా పోస్టర్ ని రిలీజ్ చేస్తూ అల వైకుంఠపురములో టీమ్, సంక్రాంతి పోటీకి సై సై అంటున్నట్లు అర్ధం అవుతుంది. మరి రాబోయే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: