2015లో మొదలైన రాజుగారి గది ఫ్రాంఛైజీ అంతకంతకు క్రేజ్ ని క్రియోట్ చేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ లో రెండు సినిమాలొచ్చాయి. మొదటి బాగం హిట్ అవగా, రెండవభాగం మాత్రం ఫ్లాప్ గా మిగిలింది. సమంత-నాగార్జున వంటి స్టార్స్ ఉన్నప్పటికి, సీరత్ కపూర్ గ్లామర్ డోస్ బాగా పడినప్పటికి అవేవి సినిమాని సక్సస్ వైపు తీసుకెళ్ళలేకపోయాయి. అయినా ప్రస్తుతం మూడో సినిమా రాజుగారి గది 3 తెరకెక్కుతోంది. దర్శకుడు ఓంకార్ ఈసారి మరింతగా  హారర్ ని డోస్ పెంచాడని ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ స్పష్టంగా చెప్పింది. తమ్ముడు అశ్విన్ లోని టాలెంట్ ని ఈసారి ఇంకా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఓంకార్. అలాగే ఏమాత్రం క్రేజ్ లేని బబ్లీ బ్యూటీ అవికాగోర్ ఈ సినిమాలో దెయ్యం పాత్రలో భయపెట్టబోతోంది. 

వాస్తవంగా ఓపెనింగ్ మిల్కీ బ్యూటి తమన్నా తో చేశారు. ఈ అమ్మడు కథలో వేయిట్ లేదని సింపుల్ గా తప్పుకుంది. తర్వాత కాజల్ పేరు వినిపించిన పోస్టర్ లో కనిపించ లేకపోయింది. అందుకే ఫైనల్ గా మొత్తానికే ప్రాజెక్ట్ కి సమస్య వస్తుందని ఆగ మేఘాలమీద అవికా ని సెలెక్ట్ చేశారు ఓంకార్. ఇక కామెడీ.. హారర్.. థ్రిల్ అన్నిటినీ కలిపి సరికొత్త దెయ్యాల గదిలోకి పంపించబోతున్నారని ఈ సినిమా పోస్టర్లు .. టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక స్టార్ హీరోల సినిమాల మాదిరిగానే రాజుగారు కూడ తాజాగా దసరా పోస్టర్ తో శుభాకాంక్షలు తెలుపుతు వచ్చే శారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈసారి ఓంకార్- అశ్విన్ బ్రదర్స్ ఇచ్చే ట్రీట్ మామూలుగా ఉండదని అర్థమవుతోంది. మరి పోస్టర్ లో కనిపించిన ఆసక్తి సినిమాలో ఉంటుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

ఇక పాత పంథాలోనే ఇప్పటికే చూసేసిన సినిమాల్లా కాకుండా కొత్తగా ఏం చూపిస్తాడన్నదే ఈ హారర్ సినిమా విజయానికి ప్లస్ అవుతుంది. ఏదో ఆర్.ఆర్ మెరుపులతో.. నాలుగైదు డీటీఎస్ స్టీరియో డెక్ సౌండ్స్ తో భయపెట్టేద్దామంటే మాత్రం జనం భయపడడం లేదు. అందుకే ఓంకార్ ఆ విషయంలో.. కథ-కథనం పరంగాను ఎంత జాగ్రత్త తీసుకున్నాడు? అన్నది చూడాలి. అలీ -బ్రహ్మాజీ-హరితేజ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. చోటా.కె ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న రాజుగారి గది 3 అక్టోబర్ 18న రవిబాబు తెరకెక్కించిన ఆవిరి.. ఆది సాయి కుమార్ నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలతో పోటీగా రిలీజవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: