తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3 ఫైనల్ కి చేరుకుంది. ప్రస్తుతం 12వ వారం లో అడుగుపెట్టిన సీజన్ 3...హౌస్ లో ఏడుగురు సభ్యులు మిగిలి ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్-3 గత రెండు సీజన్ల కంటే ఎక్కువగానే ఆదరణ దక్కించుకోవడం విశేషం. ముఖ్యంగా యాంకర్ గా నాగార్జున అదరగొడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సీజన్ కి మైనస్ పాయింట్ ఒకటి ఉందని ఇటీవల సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.
అదేమిటంటే ఓటింగ్ ప్రక్రియ అనేది ముందునుంచి రహస్యమే అయినా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది ముందే తెలిసిపోతోంది. సోషల్ మీడియాలో లీకులు వచ్చేస్తున్నాయి. ఇక రేటింగ్స్ కోసం బిగ్బాస్ నిర్వాహకులే ముందు నుంచి ప్రోమోలను వదులుతుండడంతో ప్రేక్షకుల్లో అసలు ట్విస్ట్ రివీల్ అయ్యి ఆసక్తి సన్నిగిల్లుతోంది. అంతేకాకుండా గత రెండు సీజన్లలో ఇంటి సభ్యుల మధ్య ఐక్యత ఎక్కువుగా ఉండేది.
ఇప్పుడు ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది స్వార్థంతోనే వ్యవహరిస్తున్నారన్నది ఓపెన్గానే తెలిసిపోతోంది. మరియు అదే విధంగా హౌస్ లో గేమ్ చాలా స్ట్రాంగ్ గా ఆడేవాళ్లు ఎలిమినేట్ అవ్వడం...వీక్ గా ఆడే కంటెస్టెంట్ లు హౌస్ లో కొనసాగడంపై అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లోనూ యాక్టివ్గా కనిపించని పునర్నవి 11 వారాల పాటు హౌస్లో నెట్టుకొచ్చింది. ఇందుకు రాహుల్ – పునర్నవి మధ్య నడిచిన లవ్ ట్రాక్ రీజన్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొత్తం మీద బిగ్బాస్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న గాని మైనస్ పాయింట్లు చాలానే ఉన్నాయి అని షో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు.