వారు చేసేది టివి షోలే అయినా వారికి ఒక చిన్నపాటి హీరోయిన్ కు ఉండే క్రేజ్ ఉంటుంది.  కేవలం టివి షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్స్ లో కూడా వారి హంగామా ఉండాల్సిందే. అందుకే యాంకర్లకు బాగా క్రేజ్ ఉంటుంది. 

 

సుమ,  ఝాన్సీ కేవలం కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే చేస్తారు. అందుకే ఆ తర్వాత ఉన్న యాంకర్లు ఆ షోలు చేస్తారు. ప్రస్తుతం ఫిమేల్ యాంకర్ లలో  అనసూయ,  రష్మీ మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే పదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్న మంజూషకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే మంజూష ఈమధ్య బాగా ఎక్కువగా కనబడుతుంది.

 

అయితే యాంకరింగ్ చేస్తూ వీళ్ళు బాగానే సంపాదిస్తున్నారు. జబర్దస్త్ అనసూయ ఇప్పటికే ఆడి కారు మైంటైన్ చేస్తుంది. ఈమధ్య హరితేజ కూడా వాల్వో కారు కొన్నది. వాల్వో ఎస్.యు.వి లగ్జరీ వెహికల్ హరి తేజ సొంతం చేసుకుంది.

 

ఇక ఇప్పుడు మంజూష కూడా బెంజ్ సెడాన్ వెహికల్ కొన్నది. పదేళ్లుగా యాంకర్ గా చేస్తున్న మంజూష ఇన్నాళ్లకు లగ్జరీ కారు కొన్నది అంటే అమ్మడు మంచి ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. హీరోయిన్ కన్నా ఇలాంటి యాంకర్లు రెండు చేతులా సంపాదిస్తున్నారు అని  తెలుస్తుంది. మొన్నటిదాకా కొద్దిగా వెనుక పడ్డట్టు అనిపించిన మంజూష ప్రస్తుతం బిజీ యాంకర్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: