మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా మరో వైవిధ్యమైన కథ తో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కబోయో నూతన చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌ ప్రతీసారి వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం 'ఎఫ్ 2', 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' సినిమాలతో సూప‌ర్‌ హిట్స్‌ను సొంతం చేసుకున్న మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ హీరోగా గురువారం హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభించారు.

ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నాగ‌బాబు క్లాప్ కొట్ట‌గా, కొణిదెల సురేఖ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అర‌వింద్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అల్లు అర‌వింద్‌, అల్లు బాబీ, సిద్ధు ముద్ద క‌లిసి హీరో వ‌రుణ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కిరణ్ కొర్ర‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు.

ఇక ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం అమెరికాకు వెళ్లి ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ తీసుకుని వచ్చాడు వ‌రుణ్‌. అంతేకాదు మరోసారి చాలా కొత్త మేకోవ‌ర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీతం అందిస్తుండగా జార్జ్ సి.విలియ‌న్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపారు. ఇక 2020 సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో వరుణ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: