తమిళ సూపర్ స్టార్ సూర్య కెరీర్ పరంగా కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కాప్పన్. తెలుగులో ఈ సినిమా బందోబస్త్ పేరుతో ప్రేక్షకుల ముందుకు  రావడం జరిగింది. సూర్య సరసన తొలిసారి సాయేషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రను పోషించారు. సూర్య ఎన్ఎస్జీ కమాండర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆర్య ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. 

గతంలో సూర్య మరియు కెవి ఆనంద్ ల కాంబినేషన్లో వచ్చిన వీడోక్కడే, బ్రదర్స్ సినిమాలు మంచి విజయవంతం అవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తెలుగులో ఈ సినిమా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, తమిళ నాడులో మాత్రం మంచి టాక్ తో కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇక నిన్నటితో మొత్తంగా రూ.100 కోట్ల కలెక్షన్ సంపాదించిన ఈ సినిమా, చాలారోజుల తరువాత సూర్య కెరీర్ లో మంచి విజయవంతమైన సినిమాగా నిలిచింది. మంచి యాక్షన్స్ సీన్స్ తో పాటు ఆకట్టుకునే కథ, 

కథనాలు మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సాగిన ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. సూర్య, మోహన్ లాల్ ల అద్భుతమైన నటన, హారిస్ జయరాజ్ పసందైన మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్టన్నింగ్ ఫైట్స్, క్లైమాక్స్ ట్విస్ట్ వంటివి ఈ సినిమాకు అక్కడ మంచి విజయాన్ని అందించడం జరిగింది. ఇక ఈ సినిమాతో మంచి హిట్ కొట్టిన సూర్య, ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే చివరిదశకు చేరుకున్న ఆ సినిమా, డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: