సాహోతో అంచనాలను అందుకోవడం లో ఫెయిల్ అయిన ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. సినిమా టైటిల్ గా జాన్ అన్నది ప్రచారం లో ఉంది. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ప్రభాస్ ఫాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. అందేంటి అంటే ఈ నెల చివర్లో జాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచన లో ఉన్నారట చిత్రయూనిట్. 

 

జిల్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాధాకృష్ణ ప్రభాస్ తో పిరియాడికల్ లవ్ స్టొరీ చేస్తున్నాడట. రోమ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందట. సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్దే నటిస్తుంది. 

 

సాహో నిర్మించిన యువి క్రియేషన్స్ వారే ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈసినిమా బడ్జెట్ కూడా 150కోట్లు పైనే అని తెలుస్తుంది. అంటే ఈ మూవీ ని కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

 

ప్రభాస్ బర్త్ డే సందర్బంగా ఈ నెల 23న జాన్ ఫస్ట్ లుక్ వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే 4 షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ఫిక్స్ చేస్తారట.  మరి జాన్ ప్రభాస్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: