బిగ్ బాస్ షో కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి ఆ ఛానల్ కి వచ్చిన టిఆర్ పి రేటింగ్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ షోనే కాదు అందులో కంటెస్టెంట్స్ కి కూడా చాలా పాపులారిటీ వస్తుంది. అందుకే బిగ్ బాస్ అనగానే వాళ్ళకున్న వ్యాపకాలన్నీ వదిలేసి వస్తుంటారు. బిగ్ బ్రదర్ నుండి స్టార్ట్ అయిన ఈ షో ఇప్పుడు అన్ని భాషల్లోకి విస్తరించింది.


తెలుగు, తమిళంలో ఈ షో సూపర్ డూపర్ హిట్. అయితే తాజాగా ఓ సంఘటన బిగ్ బాస్ పాపులారిటీని మరోసారి బయటపెట్టింది. గత ఆదివారం  కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3 ముగిసింది. విన్నర్ గా మలేసియాకు చెందిన యూట్యూబ్ సెన్సేషన్ మరియు సింగర్ అయిన మిగన్ రావ్ నిలిచారు. మిగన్ రావ్ మరియు శాండీ మాస్టర్ ఫైనల్స్ చేరుకోగా, ఉత్కంఠ మధ్య మిగన్ రావ్ విజేతగా నిలిచాడు. 


దీనితో అతనికి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 50లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభించింది. ఇదిలా ఉంటే ఈ సింగర్ కి మలేషియాలో ఎంతో ఆదరణ లభించింది. మిగన్ రావ్ మలేషియాలోని బాటు కేవ్స్ నందు గల సుబ్రమణ్యస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాడట. అయితే మిగన్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు గంట ముందు నుండే వెయిట్ చేసారట. ఒక్కసారిగా ఆయన రాగానే అందరూ
మీద పడిపోయి ఆటోగ్రాఫ్ ల కోసం సెల్ఫీల కోసం ఆయన మీద పడ్డారట.


ఒక సినిమా స్టార్స్ కి సమానంగా ఉన్న ఆయన క్రేజ్ చూసిన అక్కడ ఉన్న జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇది తెలిసిన చాలా మంది ఒక రియాలిటీ షోలో గెలిస్తే ఇంత ఆదరణ ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే మిగన్ అనకు ఓట్లేసి గెలిపించిన అభిమానులకు, అలాగే ఇంత ఆదరణ చూపిస్తున్న వారికి తన్ కృతజ్ఞతలు తెలియజేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: