తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అయితే అదే సమయంలో ఎన్నో విమర్శలని కూడా ఎదుర్కొంది. ఈ సినిమాలో వైన్, సిగరెట్లు ఎక్కువయ్యాయని చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలన్నింటికీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరెన్ని చెప్పినా ఈ సినిమా తెలుగులో ఓ కల్ట్ క్లాసిక్ గా నిచిపోయిందన్నది వాస్తవం.


అయితే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా "కబీర్ సింగ్" పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. అయితే హిందీలో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తూ రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. మూడు వందల కోట్లు సాధించి షాహిద్ కపూర్ కెరీర్లోనే హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే హిందీలో కూడా ఈ సినిమాకి విమర్శలు తప్పలేదు.


ఇక హిందీలో ఈ సినిమాపై విమర్శలు మరీ దారుణంగా వచ్చాయి. కబీర్ సింగ్ క్యారెక్టర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేలాగా ఉందని, అంతే కాదు అక్కడ పెద్ద విమర్శకులు అని పేరున్న వారు సైతం ఈ సినిమా రేప్ కల్చర్ ని ప్రోత్సహించేలా ఉందని అభిప్రాయ పడ్డారు. ఈ విమర్శలకి తనదైన శైలిలో దర్శకుడు సందీప్ సమాధానం ఇచ్చాడు. అయితే తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈ సినిమాపై స్పందించింది.


కరీనా మాట్లాడుతూ  నేను ఆ చిత్రాన్ని చూడలేదు అయినా దాని వల్ల వచ్చే నష్టమేమీ లేదు. అయితే సినిమా గురించి వచ్చిన కామెంట్లను నేను విన్నాను. సినిమా తిట్టేవారు ఎంత మంది ఉన్నా.. అంతకంటే ఎక్కువ మందే ప్రేమించిన వారుండటం విచారకరం. అయితే ప్రజలు తమ అభిప్రాయాలను బయటకు చెప్పారు అది సంతోషించాల్సిన విషయం. నా వ్యక్తిగతానికి వస్తే.. కబీర్ సింగ్‌లో కియారా పాత్ర నన్ను ఏ మాత్రం ప్రభావిత చేయదు.. ఎందుకంటే అది కేవలం సినిమాలోని ఓ క్యారెక్టర్ మాత్రమేనంటూ చెప్పుకొచ్చింది.




మరింత సమాచారం తెలుసుకోండి: