అక్కినేని వారి నటవారసుడు నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నిధి అగర్వాల్, ఆ తరువాత చైతన్య సోదరుడైన అక్కినేని అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే అనూహ్యంగా అక్కినేని సోదరులతో కలసి ఆమె నటించిన ఆ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే హీరోయిన్ గా మాత్రం నిధి అందచందాలు కుర్రకారుని ఒక ఊపు ఊపాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో ఒక హీరోయిన్ గా నటించిన నిధి, ఆ సినిమా మంచి హిట్ కొట్టడంతో మంచి పేరు సంపాదించింది. 

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు ప్రాజక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు, నేడు తన ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ని ఇచ్చింది. ఉన్నట్లుండి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్ లో తన స్టేటస్ ని సింగిల్ కి బదులు, ఎంగేజ్డ్ అని పెట్టడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ షాక్ అయి, ఆమెకు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మేడం సడన్ గా మీ స్టేటస్ ఎంగేజ్డ్ అని మార్చారు, మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ? మీకు ఎవరితోనైనా ఎంగేజ్మెంట్ జరిగిందా ? అంటూ పలువురు నెటిజన్లు ఆమెకు ప్రశ్నలు సంధించడం మొదలెట్టారు. 

అయితే ఆమె నుండి మాత్రం ఆ విషయమై ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. అయితే ఆమె ఏ ఉద్దేశ్యంతో ఎంగేజ్డ్ అని తన స్టేటస్ ని మార్చారో మనకు తెలియదు కదా, ఆమె దృష్టిలో ఆ పదానికి మరొక అర్ధం ఉండి ఉండొచ్చేమో, కాబట్టి పూర్తి సమాచారం తెలియకుండా ఆమెను మనం పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేసేలా ప్రశ్నించడం సరికాదని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. మరి ఈ విషయమై నిధి ఏమని సమాధానం చెప్తుందో చూడాలని ఆమె ఫ్యాన్స్ ఎంతో అతృతతో ఎదురుచూస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: