సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా తన నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు చూపించారు. ఇకపోతే ఈ సినిమాను ఇటీవల వీక్షించిన తమిళనాడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్, సినిమాపై అలానే మెగాస్టార్ చిరంజీవి నటనపై ఎంతో అద్భుతమైన ప్రశంసలు కురిపించారు. ఇకపోతే నేడు మెగాస్టార్ మరియు ఆయన సతీమణి సురేఖ గారు, ఆంధ్ర రాజధాని అమరావతి చేరుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైరా సినిమా చూడవలసిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం, తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరుకున్న మెగాస్టార్ దంపతులు, ఆయనను ప్రత్యేకంగా సైరా వీక్షించ వలసినదిగా కోరినట్లు, అందుకు సీఎం గారు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అయితే మెగాస్టార్ దంపతులు సహా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిఎం జగన్ గారిని ఆహ్వానించడానికి వస్తారని వార్తలు రావడం జరిగింది. అయితే ఆయన రాకపోవడానికి ఒక కారణం ఉందట. అదేమిటంటే, ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చరణ్ కు షెడ్యూల్ ఉన్నకారణంగా, సీఎం గారిని కలవడానికి రాలేకపోయినట్లు తన తరపున అదే విషయాన్ని తన తండ్రి మెగాస్టార్ ద్వారా సీఎం గారికి తెలుపమని చెప్పినట్లు కూడా సమాచారం. మరి మెగాస్టార్ కోరిక మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైరా సినిమా చూసి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.....!!