యంగ్ హీరో రాజ్ తరుణ్ కెరీర్ గత కొంతకాలంగా సినిమాలు లేక బాగా వెనకబడిపోయాడు. వెనకబడిపోయిన యంగ్ హీరోస్ తో చూస్తే ముందుగా
రాజ్ తరుణ్ పేరే వినిపిస్తుంది. కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత
రాజ్ తరుణ్ కెరీర్ బాగా ఊపందుకుంటుందనుకుంటే ఒకటి రెండు సినిమాల తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఎట్టకేలకు మెల్లగా మళ్ళీ ఈ కుర్ర హీరో కెరీర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను నవంబర్ లో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.
రాజ్ తరుణ్ కి జంటగా అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
జీ.ఆర్
కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమానుంచి 'యూ ఆర్ మై హార్ట్ బీట్' అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. మిక్కీ జే. మేయర్ ఈ సినిమాకు సంగీతదర్శకత్వం వహించాడు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు బాలాజీ చక్కటి సాహిత్యం అందించాడు. 'నువ్వే నువ్వే.. నువ్వే కదా నా తోడు నువ్వే కదా.. నీకు నాకు ఉందో కథ ఆ పేరు ప్రేమే కదా' అంటూ చక్కటి పదాలతోనే సాహిత్యం సాగింది. అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకు మరీ హైలెట్.
మిక్కీ జే. మేయర్ రీసెంట్గా 'వాల్మీకి' మ్యూజిక్ తో ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా తన స్టైల్ కు సూటయ్యే లవ్ స్టొరీ కాబట్టి ఫీల్ గుడ్ సాంగ్స్ ఖచ్చితంగా ఇస్తాడని ఫిక్సవ్వచ్చు. ఇక ఈ సినిమాతో పాటు
రాజ్ తరుణ్ మాళవిక నాయర్ జంటగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుsతుంది. 'ఒరేయ్.. బుజ్జిగా' అనే టైటిల్ తో రొమాంటిక్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభమైంది. ఇక దర్శకుడు కొండా
విజయ్ కుమార్-రాజ్
తరుణ్ కాంబినేషన్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఇద్దరికి కూడా మంచి కమర్షియల్ సక్సస్ చాలా అవసరం. ముఖ్యంగా దర్శకుడికి ఈ సినిమా హిట్ ఎంతో కీలకం.