తమిళ నటుడు
విజయ్ హీరోగా నటించిన " బిగిల్ " సినిమా వివాదాల వల్ల వార్తల్లో నిలిచింది. సినిమా యూనిట్ విడుదల చేసిన పోస్టర్ పై మాంసం వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేయడం తో మొదలైన వివాదం కొన్ని రోజుల తరువాత సద్దుమణిగింది. . ఇప్పుడు బిగిల్ సినిమా మళ్ళీ వార్తల్లో నిలుస్తోంది ఈ సారి వివాదాల వల్ల కాదు. రీసెంట్ గా రీలీజ్ అయిన బిగిల్ ట్రైలర్ కు అన్ని చోట్ల నుండి మంచి స్పందన వస్తుంది. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ,
కరణ్ జోహార్ లు బిగిల్ ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమాకు తమిళం లోనే కాకుండా టాలీవుడ్ , బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా లో
విజయ్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారు. బిగిల్ సినిమా
విజయ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా దాదాపుగా 200 కోట్ల
బిజినెస్ చేసిందని టాక్. దర్శకుడు అట్లీ మరియు
విజయ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా బిగిల్ . ఇంతకు ముందు వచ్చిన తేరి, మెర్సెల్ సినిమాలు మంచి విజయం సాధించాయి.
బిగిల్ సినిమా రీసెంట్ గా సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు సమాచారం. అధికారికంగా సర్టిఫికెట్ విడుదల చేయాల్సి ఉంది. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కల్పతి ఎస్.అఘోరం బిగిల్ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ సరసన అందాల తార
నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ నటుడు
జాకీ ష్రాఫ్, కథిర్, యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బిగిల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుక గా విడుదల కానుంది.