మన్మధుడు-2 సినిమా తర్వాత నాగార్జున తన తర్వాతి సినిమాని ఇంతవరకు ప్రకటించలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మన్మధుడు బాక్సాఫీసు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు సినిమాలో బూతు ఎక్కువైందనే టాక్ కూడా వినబడింది. మన్మధుడు సినిమాకి సీక్వెల్ అనుకున్న ప్రేక్షకులకి నాగార్జున పెద్ద షాక్ ఇచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత నాగార్జున ఎక్కడా కనిపించలేదు. 


బిగ్ బాస్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయాడు. మొన్న సైరా సినిమా చూసిన తర్వాత కూడా ప్రెస్ తో మాట్లాడలేదు. అయితే నాగార్జున తన తర్వాతి చిత్రం ఎవరితో తీయాలనుకుంటున్నాడనేది ఆసక్తిగా మారింది. "సోగ్గాడే చిన్ని నాయానా" సినిమాతో విజయాన్ని అందించిన దర్శకుడు కళ్యాణ్ క్రిష్ణతో సోగ్గాడు చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు తీయాలని అనుకున్నారు. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి.


దర్శకుడు కళ్యాన్ క్రిష్ణ కూడా ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇకపోతే నాగార్జున కి బాలీవుడ్ చిత్రం అయిన "రైడ్" చిత్రం బాగా నచ్చిందట. అజయ్ దేవగణ్ నటించిన ఈ మూవీ బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టింది. అందుకని ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.


ఇన్ కమ్ టాస్క్ రైడింగ్ నేపథ్యంలో సాగే ఈ డ్రామాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తిస్తే ఆడియన్స్ కి నచ్చుతుందన్న ఉద్దేశ్యంతో ఆ రీమేక్ వైపు వెళ్దామని అనుకుంటున్నాడట. అయితే దర్శకుడిని మాత్రం ఆచితూచి తీసుకోవాలని భావిస్తున్నాడట. మన్మధుడు-2 విషయంలో జరిగిన తప్పును మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా పై ఇంకా అధికార ప్రకటన రాలేదు. మరి రైడ్ ని రీమేక్ చేస్తాడా లేదా అనేది తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: