ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పూజ. ఆ తర్వాత వరుస సినిమాలను చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పుడు దర్శకుడు ఎలాంటి సినిమా తీయాలన్న దానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగి పోయి నటిస్తుంది పూజ. ఇక తన అందం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అటు గ్లామర్ పాత్రలు చేయడంలో...ఇటు భిన్నమైన పాత్రలు చేయడం లోను పూజ హెగ్డే కు మంచి పేరుంది. అయితే భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది పూజా హెగ్డే. అటు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది పూజ హెగ్డే. అయితే తాజాగా ఈ భామ గడ్డలకొండ గణేష్ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి అందమైన ముద్దుగుమ్మల కనిపించి అందరినీ మెప్పించింది.
ఇక ఆ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ లో కూడా కనిపించనుంది . అల్లు అర్జున్ తో జోడీ కట్టి అలా వైకుంఠపురం అనే సినిమాలో కూడా నటించబోతోంది పూజ. ఇటు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అటు బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ అమ్మడు . దీంట్లో భాగంగానే హౌస్ ఫుల్ 4 అనే సినిమాల్లో నటించింది ఈ భామ. కాగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది పూజ. అయితే అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముక్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న హౌస్ ఫుల్ 4 చిత్రం ప్రమోషన్స్ ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా చేస్తున్నారు.
అదెలా అంటారా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హౌస్ ఫుల్ 4 ఎక్స్ ప్రెస్ అనే కొత్త రైల్ ని ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రైళ్లో నటీనటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. అయితే ఈ విధంగా రైల్వే శాఖ ప్రజలకు మరింత చేరువ అవుతుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రమోషన్స్ ఆన్ వీల్స్ అనే పేరు కూడా పెట్టారు మంత్రి. అయితే ఈ రైలు ద్వారా నటులు తమ తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మంత్రి .