టాలీవుడ్ సూపర్ స్టార్
మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. దిల్ రాజు,
మహేష్ బాబు,
అనిల్ సుంకరలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో
మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటిస్తుండగా
రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.
తన సినిమాలను కమర్షియల్ హంగులతో తెరకెక్కించగల దిట్టగా పేరుగాంచిన
అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా ఎంతో అద్భుతంగా,
మహేష్ బాబు క్రేజ్ కు తగ్గట్లు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బండ్ల గణేష్, సంగీత,
మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్,
శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా
బిజినెస్ అదరగొట్టే రేంజ్ లో జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే కొన్ని ఏరియాల
బిజినెస్ లో దూసుకెళ్లిన సరిలేరు నీకెవ్వరు సినిమా, ఓవర్సీస్ హక్కుల విషయమై అత్యధిక ధరకు అమ్ముడైనట్లు సమాచారం.
అక్కడ ప్రముఖ పంపీణీ సంస్థగా పేరుగాంచిన గ్రేట్
ఇండియా ఫిలింస్ వారు ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఇటీవల దక్కించుకున్నారు. మరోవైపు
భరత్ అనే నేను,
మహర్షి సినిమాల వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న
మహేష్ బాబు, ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తన్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.....!!