సోషల్ మీడియా  సెన్సేషన్ హీరోయిన్ మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాష్ వారియర్ కి  మొదట్లో   కొన్ని ఆఫర్లు వచ్చినా.. అమ్ముడికి ఆశ ఎక్కువై భారీగా  రెమ్యునరేషన్ ను  డిమాండ్ చేసింది. దాంతో వచ్చిన ఆఫర్లు కాస్త దూరమైపోయాయి. ఇక ఆ తరువాత ఆమె హీరోయిన్ గా నటించిన 'ఓరు అదార్ లవ్' చిత్రం  'లవర్స్ డే' పేరుతో తెలుగులోకి  డబ్ అయి ఫ్లాప్ కావడంతో  ఆమె ఆశలకు బ్రేకులు పడ్డాయి.  దాంతో ఈ యంగ్ బ్యూటీకి తత్త్వం బోధపడింది. ఇచ్చినంతే పుచ్చుకుంటా  ముందు మీ సినిమాలో  ఛాన్స్ ఇవ్వండి అని అందర్నీ అడుగుతుందట.  కాగా  పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ  సెన్సేషన్  మలయాళ బ్యూటీ   విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య   'నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని విజయ్ గురించి  ప్రియా పోస్ట్  కూడా చేసింది. అందుకే విజయ్ దేవరకొండ, పూరిని  అడిగి మరి  అమ్మడికి అవకాశం ఇప్పించాడట.  ఈ సోషల్ మీడియా హీరోయిన్ ను మలయాళంలో ఎవ్వరూ పెద్దగా పటించుకునట్లు కనబడట్లేదు.  అందుకే ఆమె తెలుగు ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుంది.  
 
దక్షిణాదిన ఇతర భాషల్లో ఒకటి రెండు సినిమాలు చేసి మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లు నెక్స్ట్ టార్గెట్ చేసేది తెలుగు సినిమా పరిశ్రమే.  అలా వచ్చిన వారే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, రష్మిక మందన్న.  ప్రస్తుతం వీరి కెరీర్ టాప్ గేర్లో ఉంది.  వీళ్ళ మాదిరిగానే  ప్రియా ప్రకాష్ వారియర్ సైతం పయనించబోతుంది.  ఈ క్రమంలోనే నితిన్  కొత్త సినిమాలో ఆమె రెండో కథానాయకిగా ఛాన్స్ కొట్టేసింది.  ఇప్పుడు మరో తెలుగు  సినిమాలో కూడా నటించబోతుందట. నాగశౌర్య హీరోగా రాబోయే ఓ సినిమాలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు చిత్రాల్లో  తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు ప్రియాకి బాగానే వస్తాయి.  మరి సోషల్ మీడియాలో సక్సెస్ అయినట్లు తెలుగు సినిమాల్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం   


మరింత సమాచారం తెలుసుకోండి: