సూపర్ స్టార్
మహేష్ బాబు ప్రస్తుతం "సరిలేరు నీకెవ్వరు"చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసరుగా కనిపించనున్న
మహేష్ ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తాడో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి ౧౨ వతేదీన విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
అయితే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కూడా సినిమాలని చూడటం ఆపట్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే
మహేష్ చాలా విషయాలని తన అభిమానులతో పంచుకున్నాడు. సినిమా గురించైనా, ఫ్యామిలీ గురించైనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.పర్సనల్ మరియు ప్రొఫెషన్ విషయాలే కాకుండా, కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ అలాగే ఇతర హీరోల మూవీలపై ఆయన స్పందిస్తూ ఉంటారు.
ఇటీవల అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అంటుకున్నప్పుడు
మహేష్ స్పందించాడు. అలాగే తన తోటి నటుల సినిమాల విషయంలో గానీ, ఇంకా వేరే చిన్న సినిమాల గురించైనా కానీ తన స్పందనని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాడు. అయితే తాజాగా ఒక సినిమా తనకి నచ్చిందని ట్విట్టర్లో పోస్త్ చేశాడు. తమిళ నటుడు
ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన "అసురన్" మూవీ తనకి బాగ నచ్చిందని,
ధనుష్ పర్ ఫార్మెన్స్ చాలా బాగుందని, సినిమా టీంకి అభినందనలు తెలియజేశాడు.
దీంతో ధనుష్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.తమ హీరో మూవీని అంతలా పొగిడిన మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇన్ని మంచి లక్షణాలు ఉండబట్టే సూపర్ స్టార్ అయ్యాడని.. ఊరికే అయిపోలేదని అంటున్నారు. అంతే కాదు మహేష్ తర్వాతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నమని తెలియజేశారు.