మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే చాలావరకు షూటింగ్ ని జరుపుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, అలానే రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ విజయశాంతి గారు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాలో మరొక హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. 

ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విలన్ ఇంటి సెట్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగిందని, ఇక మిగిలి ఉన్న ఆఖరి షెడ్యూల్ కోసం సినిమా యూనిట్ సిద్ధం అవుతోందని అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంతేకాదు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలా ఒక పెద్ద దీపావళి సర్ప్రైజ్ ని కూడా సిద్ధం చేశామని అనిల్ తన ట్వీట్  లో తెల్పడం జరిగింది. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇప్పటివరకు తన దర్శకత్వ కెరీర్ లో ఒక్క అపజయం కూడా లేని అనిల్ రావిపూడి, ఈ సినిమాను కూడా మంచి పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మరోవైపు ఈ సినిమాకు పోటీగా అదే రోజున రిలీజ్ అవుతున్న బన్నీ అల వైకుంఠపురములో సినిమా యూనిట్ ప్రమోషన్స్ తో దూసుకుపోతుండడంతో, సరిలేరు టీమ్ కూడా ఇక పై పక్కాగా ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే దీపావళి కానుకగా పోస్టర్ రిలీజ్ చేస్తారా లేక ఏదైనా సాంగ్ టీజర్ ని రిలీజ్ చేస్తారా అని మహేష్ ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చలు మొదలెట్టేసారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: