టాలీవుడ్ లో  అందం అభినయం కలిసిన ముద్దు గుమ్మా  రశ్మిక మందన్న. అయితే ఈ అమ్మడికు లక్కు  కూడా బాగానే కలిసి వస్తుంది. టాలీవుడ్ లో నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రష్మిక... వరుస ఆఫర్లు చేజిక్కించుకొని దూసుకుపోతుంది. అయితే రష్మిక నటించిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటుండడంతో  టాప్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక హవా నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. వరుస సినిమాలు చేజిక్కించుకుంటూ  స్టార్ హీరోల సరసన మెరుస్తుంది. 

 

 

 

 అయితే ఇప్పుడు ఏ హీరో అయినా ఏ దర్శకుడైనా తమ  సినిమాలో రష్మిక  అయితే బాగుంటుందని భావిస్తున్నారు. కాగా దర్శకుల అందరికీ తమ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు  కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రష్మిక. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు... మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో నటిస్తోంది... అంతేకాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాలో ... టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురం సినిమాలో  అల్లు అర్జున్ సరసన మెరవబోతుంది ఈ అమ్మడు. అయితే ఈ అమ్మడుకి తెలుగులోనే కాదండోయ్ కన్నడంలో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అక్కడ కూడా సినిమాలను సైన్  చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ అమ్మడు. 

 

 

 

కాగా టాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన. ఇప్పటికే మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు... ఇప్పుడు అక్కినేని హీరోతో రొమాన్స్ చేయబోతుంది. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. కాగా ఈ సినిమా  వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొత్త దర్శకుడు శశితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక ని అనుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే లోనే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: