టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు తమ తదుపరి సినిమాలకు సైన్ చేయకూడదని గట్టింగా నిర్ణయించిన చరణ్ మరియు ఎన్టీఆర్ లు, ఈలోపు తమ దగ్గరకు వచ్చే దర్శకుల నుండి మంచి కథలు ఏవైనా ఉంటె వింటున్నారట. ఇకపోతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తదుపరి సినిమా విషయమై ఇప్పటినుండే కసరత్తులు మొదలెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా ఇటీవల కోలీవుడ్ లో ధనుష్ నటించిన మాస్ సినిమా అసురన్ సినిమా హక్కులను తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొదటి నుండి క్లాస్ తో పాటు మాస్ సినిమాలు కూడా చేస్తూ వస్తున్న చరణ్, ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తరువాత అసురన్ వంటి పక్కా మాస్ సబ్జక్ట్ అయితే బాగుటుందని, 

ఆ సినిమా హక్కులు కొనేందుకు చూస్తున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ధనుష్ హీరోగా వెట్రి మారన్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలై పులి ఎస్ థాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రస్తుతం తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడ ధనుష్ మాస్ ఇమేజ్ ని మరింతగా పెంచిన ఈ సినిమాపై పలు ఇతర భాషల నటుల చూపు కూడా పడిందట. గతంలో తని ఒరువన్ అనే తమిళ సినిమాను ధ్రువ పేరుతో రీమేక్ చేసి మంచి హిట్ కొట్టిన రామ్ చరణ్, మరొక్కసారి రీమేక్ సినిమా వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: