కృష్ణవంశీ తీసిన క‌ళాఖండంగా పైసా మూవీను టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఇది క్రియోట‌ర్‌ను పొగుడుతున్నారో, లేకా తిడుతున్నారో తెలియ‌దు కాని కృష్ణవంశీ కెరీర్‌లోనే రిలీజ్ విష‌యంలో ఇంత‌టి ఆల‌స్యం జ‌రిగింది పైసా మూవీనే. ఒకర‌కంగా చెప్పాలంటే కృష్ణవంశీ తీసిన పైసా మూవీ రిలీజ్‌కు ఫైనాన్షియ‌ల్ ఇబ్బందులు రావ‌డం, ఆ కార‌ణంతోనే మూవీ రిలీజ్‌కు నోచుకోలేక‌పోవ‌డం వంటి విష‌యాలు క్రియోట‌ర్ స్థాయిని త‌గ్గించాయ‌ని టాలీవుడ్ అంటుంది. ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సిన పైసా మూవీ, ఇన్నాళ్ళకు రిలీజ్‌కు రెడీ అవుతుంది. పైసా మూవీ ప్రొడ్యూజ‌ర్ ర‌మేష్ పుప్పాల మాట్లాడుతూ 'పైసా మూవీను ఫిబ్ర‌వరి 7న రిలీజ్ చేస్తున్నాము. పైసా మూవీ పూర్తి క‌మ‌ర్సియ‌ల్ ఓరియంటెడ్ చిత్రం. అన్ని క‌థ‌ల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. కృష్ణవంశీ, నాని కెరీర్‌లోనే ఇది బ్లాక్‌బ‌స్టర్ స‌క్సెస్‌ను సాధించిన ఫిల్మ్‌గా నిలుస్తుంద‌ని' చెప్పాడు. అంతేకాకుండా 'ఫిబ్ర‌వ‌రి 7న పైసా మూవీను ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నట్టు' చెప్పాడు. ఎట్టకేల‌కు పైసా మూవీ రిలీజ్‌కు నోచుకోవ‌వ‌డంతో నానికు కొద్దిపాటి ఉత్సాహం పెరిగింది. దీంతో ఒకే నెల‌లో నాని న‌టించిన రెండు మూవీలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఒక‌టి య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఆహా క‌ళ్యాణం, మ‌రొక‌టి క్రియోట‌ర్ క్రిష్ణవంశీ తీసిన పైసా మూవీ. దీంతో ఫిబ్రవరి నెల‌లో టాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద నాని సంద‌డి మొద‌లైన‌ట్టే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: