కోలీవుడ్లో హర్రర్ సినిమాల తాకిడి ఎక్కువే.. కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న దర్శకులు కూడా అక్కడ హర్రర్ థ్రిల్లర్ సబ్జెక్ట్ మీదే సినిమాలు తీస్తుంటారు. వారిదారిలోనే చెప్పుకోదగ్గ హర్రర్ సినిమాల దర్శకుడు మిస్కిన్.. రీసెంట్ గా పిశాచి సినిమా తీసిన ఈయన మరో థ్రిల్లర్ సబ్జెక్ట్ తో సినిమా తీస్తున్నాడట. సినిమా తీయడమే కాదు వింత ప్రచారంతో కూడా అందరిని ఆకట్టుకుంటున్నాడు ఈ దర్శకుడు. పిశాచి సినిమాతో తన డైరక్షన్ టాలెంట్ చూపించిన మిస్కిన్ ఇప్పుడు మరో హర్రర్ సినిమాతో రాబోతున్నాడట.


పిశాచి సినిమా తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈసారి ఈయన సినిమాకు యాంటి పబ్లిసిటీ ఇస్తున్నాడు. తన సినిమాకు తానే యాంటి పబ్లిసిటీ ఇచ్చుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాడు. తన తదుపరి సినిమా ఫ్యామిలీస్, పిల్లలు చూడొద్దని చెబుతున్నాడు. అంతేకాదు సినిమా చూసిన సెన్సార్ వాళ్లు కూడా షాక్ అవ్వడం ఖాయమని.. సినిమాకు ఖచ్చితంగా 'ఏ' సర్టిఫికెట్ వస్తుందని అంటున్నాడు.


పిశాచి దర్శకుడు మిస్కిన్:


పిశాచి సినిమా ఇచ్చిన ప్రొత్సాహంతో ఈ దర్శకుడు ఆడియెన్స్ ని మరింత భయపెట్టడానికి మంచి స్క్రిప్ట్ రెడీ చేశాడట. పిశాచి సినిమాకన్నా ఇంకా భయంకరంగా రాబోయే సినిమా ఉంటుందట. అందుకే ఆ సినిమాను ఎవరు చూడొద్దని అంటున్నాడు. ఫ్యామిలీస్, పిల్లలు చూడకుండా మరి ఈ దర్శకుడు ఎవరిని టార్గెట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడా అని డౌట్ రేజవ్వొచ్చు. ఈ దర్శకుడి ఫోకస్ అంతా యూత్ ఆడియెన్స్ మీదే ఉండంట. వారిని ఇంకా ఇంకా భయపడేలా చేస్తానని అంటున్నాడు.
మరి పిశాచితోనే హర్రర్ కి కొత్త అర్ధం చెప్పిన డైరక్టర్ మిస్కిన్ రాబోయే సినిమాను ఇంకెలా తీశాడో అని ఆడియెన్స్ లో కాస్త ఇంట్రెస్ట్ కూడా ఏర్పడ్డది.  


మరింత సమాచారం తెలుసుకోండి: