ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు మేనల్లుడు అల్లు దినేష్ అమెరికాలో మృతి చెందాడు. అక్కడి రాయల్ గోర్గే ర్యాప్టింగ్ నది ప్రాంతంలో షికారుకు వెళ్ళి ప్రమాదవశాత్తు బోటు మునిగి మృతి చెందాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మృతుడు దినేష్ ఎమ్మెల్యే కదిరి చెల్లెలి కుమారుడు. విజయవాడలో డైమండ్ల వ్యాపారం చేస్తుంటారు. దినేష్ భార్య ప్రనూష సింహాద్రి తరపు బంధువులు అమెరికాలో ఉండగా వారి పిలుపు మేరకు ఇటీవల దినేష్... ఆయన భార్య ప్రనూష అక్కడికి వెళ్ళారు.
అమెరికాలో ఉంటున్న కదిరి కుమారై యశస్విని, కుమారుడు కదిరి భువనే్షలు, మేనల్లుడు అల్లు దినేష్ ఆయన భార్య ప్రనూష సింహాద్రి కలిసి బోటు షికారుకు వెళ్లారు. బోటులో వెళ్తుండగా అది ఆదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అల్లు దినేష్ మృతి చెందాడు. భువనేష్, యశస్విని, దినేష్ భార్యను పక్కనే ఉన్న గైడ్స్ రక్షించారు. ఏడాది క్రితమే దినేష్ వివాహం చేసుకున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే కనిగిరి నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే కదిరి బాబూరావు విషాదంలో మునిగిపోయారు.