మోడీ పై ఇంటా బయటా నిరసనలు పెరుగుతున్నాయి..దేశం మొత్తం ఆ పసి గుడ్డిపై జరిగిన అత్యాచార ఘటనపై నిప్పులు చిమ్ముతున్నాయి..కేవలం ఒక్క భారత దేశం నుంచీ మాత్రమే కాదు దేశ విదేశాలలో ఉన్న ప్రతీ భారతీయ వ్యక్తీ తీవ్ర ఆవేదన, ఆందోళనని వ్యక్త పరుస్తున్నారు...వీటిపై సత్వరమే ‘అసాధారణ చర్యలు’ తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి.

 Image result for nri-students-wrote-letter-to-modi-

పదవీ విరమణ చేసిన దాదాపు  49 మంది సివిల్‌ సర్వెంట్లు మోదీకి బహిరంగ లేఖ రాశారు...ఆ బాలికకి జరిగిన అన్యాయం పై న్యాయం చేయండి అంటూ నిలదీశారు...ఈ క్రమంలోనే  లండన్‌లోని భారతీయ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా ప్రధానికి లేఖలు  రాశారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై బ్రిటన్లోని భారతీయ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

 Related image

కామన్వెల్త్‌ కోసం ప్రభుత్వాధినేతల సదస్సులో పాల్గొనడానికి మోదీ లండన్‌ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో, నేషనల్‌ ఇండియన్‌ స్టూడెం ట్స్‌ అండ్‌ అలుమ్ని యూనియన్‌ (ఎన్‌ఐఎ్‌సఏయూ) లండన్లోని భారత హై కమిషనర్‌ కార్యాలయంలో ఈ లేఖ అందజేసింది...దేశంలో ఇటువంటి భయానక పరిస్థితులు ఎదురవ్వడానికి ముఖ్య కారణం కేవలం మోడీ నే అంటూ...రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్ల బృందం విమర్శించారు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: