ట్రంప్ పెడుతున్న చిత్ర విచిత్ర ఆంక్షలకి
అమెరికా ప్రజల నుంచీ ప్రపంచదేశాల వరకూ చివరికి ట్రంప్ భార్యతో సహా అందరూ
వ్యతిరేకిస్తున్నారు..ఎప్పుడు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాడో అర్థం కాక హడలి చస్తున్నారు..వలస
జీవులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా పెను దుమారం రేగింది...వలసలు
వచ్చిన వారిని నిర్భందించి వారి పిల్లలని వారిని వేరు వేరుగా ఉంచడం తో ఈ వార్తా
సంచలనం అయ్యింది..
అంతేకాదు వలసల పై కొత్త చట్టం తీసుకువచ్చేలా ట్రంప్ అమెరికా ప్రతినిధుల సభ లో బిల్లు అయ్యేలా వ్యుహాలని రచించారు అయితే ట్రంప్ ప్రవేశ పెట్టిన బిల్లుని సైతం వారు తిరస్కరించడం తో ఒక్క సారిగా ట్రంప్ అసహనానికి లోనయ్యారు అయితే బిల్లు వీగిపొక ముందు కూడా ట్రంప్ ఇరు పార్టీలని మద్దతు ఇవ్వమని ముందుగానే కోరినా ఎవరూ బిల్లుకి మద్దతు తెలుపలేదు అయితే ఈ క్రమంలో
ట్రంప్ విధానాలని నిరసిస్తూ వీధుల్లోకి ఎంతో మంది మహిళలు వచ్చి నిరసనలు తెలిపారు..అందరూ క్యాపిటల్ హిల్ ముందు ధర్నా చేపట్టారు దాంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు..అయితే ఈ నిరసనలలో ముఖ్య పాత్ర పోషించిన భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ ప్రతినిధి ప్రమీలా జయపాల్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.ఆమెతో పాటు ఈ ధర్నాలో పాల్గొన్న సుమారు 500 మందిని పోలీసులు అరెస్టు చేశారు.