ఎంతో మంది భారతీయులు యూఏఈ కంట్రీస్ లకి వలసలు వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే అక్కడకి వెళ్ళిన వారిలో సక్రమంగా వెళ్ళిన వారు అక్రమంగా వెళ్ళిన వారు కూడా ఉన్నారు అయితే అక్రమంగా నివసిస్తున్న వారు గనుకా పట్టుబడితే అక్కడ శిక్షలు చాలా ఖటినంగా ఉంటాయి అయితే యూఏఈ మాత్రం అలాంటి వారిని ఎలాంటి శిక్షలు లేకుండా పంపేయడానికి “ఆమ్నెస్టీ-2018” ని ప్రవేశపెట్టింది..అయితే
ఈ ఆమ్నెస్టీ-2018’ ని ఉపయోగించుకుని తమ ప్రాంతాలకి వెళ్ళాలని యూఏఈ భారతీయులని తాజాగా అభ్యర్ధించింది ఈ పధకం పథకం ప్రారంభమయి సగం కాలం పూర్తైంది.ఈ పరిణామాల నేపధ్యంలో దుబాయ్లో ని “కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా” అధికారులు ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేశారు. ఆమ్నెస్టీ ద్వారా బయటపడాలనుకుంటున్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అక్కడి భారతీయులకు కోరారు..
ఇచ్చిన అవకాశాన్ని చివరి ఉపయోగించుకోవడం మంచిదని చివరి వరకూ వేచిచూసే ధోరణిలో ఉండటం అంత మంచి పద్దతి కాదని అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.. ఆమ్నెస్టీ పథకం కింద ఆగస్టు 1 ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ సరైన పాస్పోర్టు లేని 1, 450 మంది ప్రవాస భారతీయులకు ఔట్పాస్ ఇచ్చామని దుబాయ్ ఎంబసీ అధికారులు తెలిపారు.