భారతీయులు ఎక్కడ ఉన్నా సరే తమదైన శైలిలో దూసుకుని పోగల
సత్తా ఉన్న వారిగా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడు కీర్తించబడుతూనే ఉంటారు..అవకాశాన్ని అందిపుచ్చుకోగల సత్తా కేవలం భారతీయులకి మాత్రమే చెల్లింది అనడంలో సందేహం
లేదు..అందుకే ప్రపంచ
దేశాలలో భారతీయుడిక ప్రతిభకి పట్టం
కడుతున్నారు..అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు అమెరికాలో జరిగింది..వివరాలలోకి
వెళ్తే..
అమెరికా అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన అమెరికా యుద్ద విమానాలకి సంభందించిన ఒక కీలక ప్రాజెక్ట్ కి భారతీయుడికి అప్పగించారు ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే బోయింగ్ ఎఫ్ -15 యుద్ధవిమానాలు ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి అతడే నేతృత్వం వహిస్తున్నాడు..ఈ విషయాన్ని స్వయంగా అమెరికా బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఆ భారతీయుడు పేరు ప్రత్యూష్ కుమార్. ఢిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్ధిగా ప్రత్యూష్ ఎంతో ప్రతిభావంతుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.
ఇదిలాఉంటే ప్రత్యూష్ 1989లో దిల్లీ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అనంతరం మాస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ అందుకొన్నారు..ఇదిలాఉంటే ప్రత్యూష్అమెరికాతో పాటు ప్రపపంచ వ్యాప్తంగా ఎఫ్-15 వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారని ఆ సంస్థ పేర్కొంది....ప్రస్తుతం కుమార్ బోయింగ్ భారతీయ విభాగం అధ్యక్షుడిగా నియమితులై ఉన్నారు.