అమెరికాలోని టెక్సాస్ నగరంలో భారత సంతతికి చెందిన దంపతులు మృతి చెందారు. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నకిరేకంటి శ్రీనివాస్ ,శాంతి ఇద్దరు భార్య భర్తలు. ఇద్దరు తమ నివాసంలో మృతి చెందినట్లుగా సమాచారం అందటంతో వెళ్లి చూడగా తలపై తుపాకీ గాయంతో శాంతి మృతిచెంది ఉండగా.. శ్రీనివాస్ కి గుండెపై గాయం అయ్యి చనిపోయి ఉన్నారని పోలీసులు తెలిపారు.
అయితే శ్రీనివాస్ మొదట తన భార్యని తుపాకి తో కాల్చి చంపిన తరువాత , శ్రీనివాస్ తనని తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు గుర్తిన్చినట్లుగా తెలుస్తోంది. అయితే వీరిమధ్య ఎలాంటి గొడవలు లేవని ఎంతో అన్యోన్యంగా ఉండేవారని సన్నిహితులు కూడా అంటున్నారు.
వీరికి ఒక కుమారుడు , కుమార్తె ఉన్నారని తెలుస్తోంది. కుమారుడు కుమారుడు టెక్సాస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడని. కుమార్తె కి 16 ఏళ్ళని , ఆ సమయంలో ఆమె ఇంట్లోనే నిద్రపోతోందని తెలుస్తోంది. శ్రీనివాస్ హోస్టన్లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, శాంతి కంప్యూటర్ ప్రొగ్రామర్గా చేస్తోందని తెలుస్తోంది.అయితే ఇప్పటికీ వీరి మృతికి కారణాలు మాత్రం తెలియరాలేదు.