వ్యక్తిగత సమస్యల్లో కూరుకుపోయిన ఓ తెలుగు వ్యక్తి అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. తాను చనిపోవడమే కాకుండా...తన కుటుంబాన్ని సైతం చంపేశాడు. ఇద్దరు చిన్నారులు, భార్యను కాల్చి చంపాడు. అమెరికాలోని ఐవోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన సుంకర చంద్రశేఖర్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. చంద్రశేఖర్ తన భార్య లావణ్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపిన అనంతరం తాను కాల్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న చంద్రశేఖర్ తన భార్యా పిల్లలను కాల్చి.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి యజమాని చంద్రశేఖర్ మానసిక స్థితి వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు చుట్టుప్రక్కల వాళ్ళు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించిన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.